వినాయక వ్రతకల్పము

శ్రీరస్తు
శ్రీ విఘ్నేశ్వరాయ నమః
వినాయక వ్రతకల్పము
శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
       ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే.

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః



 సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంభః స్కంధపూర్వజః
షోడశైతాని నామని యఃపఠేచ్ఛృణుయాదపి.
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా,
సంగ్రామే సర్వకారేషు విఘ్నస్తస్య నజాయతే||

ఆచమనం:

ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)
శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే

ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)
ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||
||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||

శుభతిథౌ శోభనముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యావహారిక ప్రభవాది షష్టీ సంవత్సరాణాం మధ్యే...........సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం....... వాసరయుక్తాయాం..... శుభనక్షత్ర............శుభయోగ............శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిద్ధ్యర్థం, పుత్త్రపౌత్త్రాభివృద్ధ్యర్థం,సర్వాభీష్ట సిధ్యర్థం, సిద్ధివినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షొడశోపచార పుజాం కరిష్యే.

అథ షోడశోపచార పూజా
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం,
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహంభజే.
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం,
పాశాంకుశ ధరం దేవం ధ్యాయే త్సిద్ధివినాయకం.

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం,
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్.
ధాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం,
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం.
  శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర,
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ
 శ్రీ మహాగణాధిపతయే నమః ఆవహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం,
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం.
 శ్రీ మహగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన,
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం.
శ్రీ మహగణాధిపతయే నమః  ఆర్ఘ్యం సమర్పయామి.

గజవక్త్ర నమస్తేస్తు  సర్వాభీష్టప్రదాయక,
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
 శ్రీ మహగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణపరిపూజిత,
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో.
శ్రీ మహగణాధిపతయే నమః  ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీరసమాయుక్తం మథ్వాజ్యేన సమన్వితం,
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే.
శ్రీ మహగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి.

స్నానంపంచామృతైర్దేవ గృహాణ గణనాయక,
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత.
శ్రీ మహగణాధిపతయే నమః పంచామృతస్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతై రమలైర్జలైః,
స్నానం కరిష్యే భగవ న్నుమాపుత్ర నమోస్తుతే.
శ్రీ మహగణాధిపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం,
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరత్మజ
శ్రీ మహగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బ్రహ్మసూత్రం కాంచనంచోత్తరీయకం,
గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానా మిష్టదాయక.
శ్రీ మహగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం,
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్.
శ్రీ మహగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్,
గృహాణ పరమానంద శమ్భుపుత్ర నమోస్తుతే.
శ్రీ మహగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజికుందముఖానిచ,
ఏకవిశంతిపత్రాణి సంగృహాణ నమోస్తుతే.
శ్రీ మహగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి.

అథ అంగ పూజ(ప్రతి నామనికి ముందు ఓం చెప్పవలెను)
ఓం గణేశాయ నమః         పాదౌ      పూజయామి
ఏకదంతాయ నమః    జానునీ   పూజయామి
విఘ్నరాజాయ నమః  జంఘే    పూజయామి
ఆఖువాహనాయ నమః  ఊరూ    పూజయామి
హేరంబాయ నమః        కటిం పూజయామి
లంబోదరాయ నమః     ఉదరం పూజయామి
గణనాథాయ నమః        నాభిం పూజయామి
గణేశాయ నమః             హృదయం పూజయామి
స్థూలకంఠయ నమః     కంఠం పూజయామి
స్కంధాగ్రజాయ నమః  స్కంధౌ పూజయామి
పాశహస్తాయ నమః      హస్తౌ పూజయామి
గజవక్త్రాయ నమః       వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః    నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః     కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః    లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః      శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః    సర్వాణ్యంగాని పూజయామి

అథ ఏకవింశతి (౨౧) పత్ర పూజా (ప్రతి నామనికి ముందు ఓం చెప్పవలెను)

ఓం సుముఖాయ నమః   మాచీపత్రం పూజయామి
గణాధిపాయ నమః  బృహతీపత్రం పూజయామి
ఉమాపుత్రాయ నమః  బిల్వపత్రం పూజయామి
గజాననాయ నమః   దూర్వాయుగ్మం పూజయామి
హరసూనవే నమః  దుత్తూరపత్రం పూజయామి
లంబోదరాయ నమః  బదరీపత్రం పూజయామి
గుహాగ్రజాయ నమః  అపామార్గపత్రం పూజయామి
గజకర్ణాయ నమః  తులసీపత్రం పూజయామి
ఏకదంతాయ నమః  చూతపత్రం పూజయామి
వికటాయ నమః    కరవీరపత్రం పూజయామి
భిన్నదంతాయ నమః  విష్ణుక్రాంతపత్రం పూజయామి
వటవే నమః దాడిమీపత్రం పూజయామి
సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి
ఫాలచంద్రాయ నమః  మరువకపత్రం పూజయామి
హేరంబాయ నమః  సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి
సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి
ఇభవక్త్రయ నమః శమీపత్రం  పూజయామి
వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి

శ్రీ గణేశ్వరాయనమః ఏకవింశతిపత్రాణి పూజయామి

అథాష్ఠోత్తర శత(౧౦౮) నామ పూజా (ప్రతి నామనికి ముందు ఓం చెప్పవలెను)

ఓం గజాననాయ నమః
గణాధ్యక్షాయ నమః
విఘ్నరాజాయ నమః
వినాయకాయ నమః
ద్వైమాతురాయ నమః
ద్విముఖాయ నమః
సురారిఘ్నాయ నమః
మహాగణపతయే నమః
మాన్యాయ నమః
మహాకాలాయ నమః ౧౦
మహాబలాయ నమః
హేరంబాయ నమః
లంబజఠరాయ నమః
హ్రస్వగ్రీవాయ నమః
మహౌదరాయ నమః
మదోత్కటాయ నమః
మహావీరాయ నమః
మంత్త్రిణే నమః
మంగళస్వరూపాయ నమః
ప్రమథాయ నమః ౨౦
ప్రథమాయ నమః
ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
విఘ్నహంత్రే నమః
విశ్వనేత్రే నమః
విరాట్పతయే నమః
శ్రీపతయే నమః
వాక్పతయే నమః
శృంగారిణే నమః
ఓం ప్రముఖాయ నమః ౩౦
సుముఖాయ నమః
కృతినే నమః
సుప్రదీపాయ నమః
సుఖనిధయే నమః
సురాధ్యక్షాయ నమః
బలోత్థితాయ నమః
భవాత్మజాయ నమః
పురాణపురుషాయ నమః
పూష్ణే నమః
పుష్కరోక్షిప్తవారిణే నమః ౪౦
అగ్రగణ్యాయ నమః
అగ్రపూజాయ నమః
అగ్రగామినే నమః
నేత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
సర్వాయ నమః
సర్వోపన్యాసాయ నమః
సర్వకర్త్రే నమః
సర్వనేత్రే నమః
సర్వసిద్ధిప్రదాయ నమః ౫౦
సర్వసిద్ధయే నమః
పంచహస్తాయ నమః
పార్వతీనందనాయ నమః
ప్రభవే నమః
కుమారగురవే నమః
అక్షోభ్యాయ నమః
కుంజరాసురభంజనాయ నమః
ప్రమోదాయ నమః
ఆశ్రితవత్సలాయ నమః
శివప్రియాయ నమః ౬౦
శీఘ్రకారిణే నమః
శాశ్వతాయ నమః
భవాయ నమః
బ్రహ్మచారిణే నమః
బ్రహ్మరూపిణే నమః
బ్రహ్మవిద్యావిభవే నమః
జిష్ణవే నమః
విష్ణుప్రియాయ నమః
భక్త జీవితాయ నమః
జితమన్మథాయ నమః ౭౦
ఐశ్వర్యకారణాయ నమః
జ్యాయసే నమః
యక్షకిన్నరసేవితాయనమః
ఓం గంగాసుతాయ నమః
గణాధీశాయ నమః
గంభీరనినదాయ నమః
వటవే నమః
అభీష్టవరదాయ నమః
జ్యోతిషే నమః
భక్తనిధయే నమః ౮౦
భావగమ్యాయ నమః
మంగళప్రదాయ నమః
అవ్యక్తాయ నమః
మోదకప్రియాయ నమః
కాంతిమతే నమః
ధృతిమతే నమః
కామినే నమః
కపిత్థఫలప్రియాయ నమః
అప్రాకృతపరాక్రమాయ నమః
సత్యధర్మిణే నమః  ౯౦
శక్యై నమః
సరసాంబునిధయే నమః
మహేశాయ నమః
దివ్యాంగాయ నమః
మణికింకిణీమేఘలాయ నమః
సమస్తదేవతామూర్తయే నమః
సహిష్ణవే నమః
సతతోత్ధితాయ నమః
విఘాతకారిణే నమః
విశ్వగ్దృశే నమః ౧౦౦
విశ్వరక్షాకృతే నమః
కల్యాణగురవే నమః
ఉన్మత్తవేషాయ నమః
వరజితే నమః
సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఆక్రాంతచిదచిత్ర్పభవే నమః
శ్రీ విఘ్నేశ్వరాయ నమః ౧౦౮

 శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః

అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి.
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం,
ఉమాసుతం నమస్తుభ్యం గృహాణ వరధో భవ.
ధూప మాఘ్రాపయామి.

పాద్యంత్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా,
గృహాణ మంగళం దీపం మీశపుత్ర నమోస్తుతే.
దీపం దర్శయామి.

సుగన్ధాన్  సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్.


భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ  చోష్యం పానీయమేవచ,
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.
నైవేద్యం సమర్పయామి.

సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనానిచ,
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక.
సువర్ణ పుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం,
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
తాంబూలం సమర్పయామి.

సమఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలై  స్సథా,
నీరాజనం మయాదత్తం గృ హాణ వరదో భవ.
నీరాజనం సమర్పయామి.


శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:

గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించాడు। వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।

చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.

ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడింది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.

శ్యమంతకోపాఖ్యానము
చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.

నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.

ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.



అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది.


సర్వేజనాః సుఖినో భవంతు.

Note: There may be mistakes and omissions, please comment and we will rectify. Vinayaka vrata katha has been taken from https://te.wikipedia.org/wiki/వినాయక_వ్రత_కల్ప_విధానము

Comments